
కామారెడ్డి, వెలుగు : రాజీవ్ యువ వికాసం స్కీమ్కు వీలైనంత ఎక్కువ మంది అప్లయ్ చేసుకునేలా చూడాలని అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం, చీప్ సెక్రటరీ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుక బడిన నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఏప్రిల్ 5 వరకు అప్లయ్ చూసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.