
- రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,03,558 అప్లికేషన్లు
- ఉమ్మడి జిల్లాలో మొత్తం టార్గెట్యూనిట్లు 35,732
- జనాభా ప్రాతిపదికన మండలాలకు యూనిట్ల కేటాయింపు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు స్టేట్ గవర్నమెంట్రాజీవ్ యువ వికాసం స్కీమ్ చేపట్టింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 1,03,558 అప్లికేషన్లు వస్తే, జనాభా ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాకు 35,732 యూనిట్లు టార్గెట్గా కేటాయించారు. ఈ లెక్కన ఒక్కో యూనిట్కు ముగ్గురు వ్యక్తులు పోటీపడుతున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలకు ఆర్థిక సాయం, రుణాలు ఇస్తుండటంతో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 14 తోనే అప్లికేషన్ల స్వీకరణ పక్రియ కంప్లీట్ కావటంతో ఇక తదుపరి పక్రియపై అధికారులు ఫోకస్ చేశారు.
మండలాల వారీగా కేటాయింపు
జిల్లాలో జనాభాకు అనుగుణంగాఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ, ఈడబ్యూఎస్లకు యూనిట్లను కేటాయించారు. జిల్లాకు కేటాయించిన యూనిట్ల మొత్తం ఆయా మండలాల్లో వర్గాల వారీగా ఉన్న జనాభాకు అనుగుణంగా విభజించారు. మండలాల వారీగా వచ్చిన అప్లికేషన్లు కేటాయించబడిన యూనిట్లు సంబంధిత బ్యాంక్ల వారీగా కేటాయింపు ప్రక్రియ షురూ అయింది. లబ్ధిదారుల సెలక్షన్, ఆర్థికసాయం, రుణాలు ఇప్పించటం, సబ్సిడీల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్చైర్మన్, డీఆర్డీఏ పీడీ కన్వీనర్, ఆయా శాఖల అధికారులు, బ్యాంక్అధికారులు మెంబర్లుగా ఉంటారు.
మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ అధికారులు, మండల పరిధిలోని బ్యాంక్అధికారులు మెంబర్లుగా, మున్సిపల్పరిధిలో కమిషనర్కన్వీనర్గా వ్యవహరిస్తారు. అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియ షురూ అయింది. ఈ స్కీమ్లో ఫస్ట్ ప్రయార్టీ వితంతులు, ఒంటరి మహిళలు, నిరుద్యోగులు, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఇస్తారు. అప్లికేషన్ల పరిశీలన, లబ్ధిదారుల సెలక్షన్, శాంక్షన్ ప్రక్రియలు మే నెల మధ్య వరకు కంప్లీట్ చేయనున్నారు. రాష్ర్ట అవతరణ దినోత్సవం జూన్2 లబ్ధిదారులకు సెలక్షన్ పత్రాలు అందించనున్నారు.
మండలాల వారీగా, బ్యాంక్ల వారీగా కేటాయింపులపై పరిశీలన
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ, ఈడబ్యూఎస్ వర్గాలకు జిల్లాలో ఉన్న ఆ వర్గాల జనాభా ప్రాతిపధికన యూనిట్లను కేటాయించారు. నిజామాబాద్ జిల్లాకు మొత్తం యూనిట్లు 22, 285 కేటాయిస్తే అప్లికేషన్లు 58,896 వచ్చాయి. కామారెడ్డి జిల్లాకు 13,447 యూనిట్లు కేటాయించగా ఆయా వర్గాల నుంచి మొత్తం అప్లీకేషన్లు 44,662 వచ్చాయి. శనివారం ఆయా శాఖల అధికారులు బ్యాంక్ల వారీగా యూనిట్ల కేటాయింపుపై చర్యలు చేపట్టారు. మండలంలో ఉన్న జనాభా, యూనిట్లు, ఆ మండల పరిధిలో ఉన్న బ్యాంక్ శాఖలకు అనుగుణంగా యూనిట్లు బ్యాంక్లకు కేటాయిస్తున్నారు.
త్వరలోనే మీటింగ్లు
కామారెడ్డి జిల్లాలో త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, మండలాల ఎంపీడీవోలు, బ్యాంక్ అధికారులతో కలెక్టర్ మీటింగ్ నిర్వహించనున్నారు. లబ్ధిదారుల సెలక్షన్, ఆర్థిక సాయం, సబ్సిడీ, బ్యాంక్ నుంచి రుణాల వంటి వాటిపై సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాలో ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు అప్లీకేషన్ల పరిశీలన, మండలాల వారీగా, బ్యాంక్ల వారీగా యూనిట్ల విభజన పక్రియ చేపట్టారు. రూ. 50వేల లోపు ఉన్న యూనిట్లకు ఫస్ట్ శాంక్షన్ చేసే అవకాశముంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ అధికారులు చర్చించారు.
నిజామాబాద్ జిల్లా...
శాఖ మొత్తం టార్గెట్ యూనిట్ల
అప్లీకేషన్లు సంఖ్య
ఎస్సీ 10,845 5,817
బీసీ 29,638 7,969
ఎస్టీ 4,590 3,088
మైనార్టీ 12,253 2,911
క్రిస్టియన్ 253 174
ఈబీసీ, 1,317 2,326
ఈడబ్యూఎస్
మొత్తం 58,896 22,285
కామారెడ్డి జిల్లా..
శాఖ మొత్తం టార్గెట్ యూనిట్ల
అప్లీకేషన్లు సంఖ్య
ఎస్సీ 8,335 4,104
బీసీ 23,977 4,698
ఎస్టీ 4,580 2,356
మైనార్టీ 6,663 973
క్రిస్టియన్ 61 44
ఈబీసీ, 1,046 1,272
ఈడబ్యూఎస్
మొత్తం 44,662 13,447