అట్టహాసంగా రాజీవ్ విగ్రహావిష్కరణ.. సందడిగా సచివాలయం ప్రాంగణం

అట్టహాసంగా రాజీవ్ విగ్రహావిష్కరణ.. సందడిగా సచివాలయం ప్రాంగణం

హైదరాబాద్: అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన  దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాజీవ్ విగ్రహం జీవకళ ఉట్టిపడుతున్నట్టుగా ఉంది. తన మెడలోని దండను అభిమానులపై విసురుతున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆవిష్కరణ అనంతరం సీఎం, మంత్రులు విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి  దీపాదాస్ మున్సి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, రాజనర్సింహ, కొండా సురేఖ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కేకే, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.