ఎప్పటికీ కలలు కనడం ఆపొద్దు: సమంత

ఎప్పటికీ కలలు కనడం ఆపొద్దు: సమంత

ఎవర్ గ్రీన్ బ్యూటీ 'సమంత' ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం వల్ల కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు మళ్లీ సెట్స్ లోకి రాబోతుందట. తన నెక్ట్స్ ప్రాజెక్టు 'రక్త బ్రహ్మండ్' తో మళ్లీ స్క్రీన్ మీదకు రాబోతోంది. . ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటివరకు రాని కొత్త పాయింట్ తో వెబ్ సిరీస్ ను మాట్ చేస్తున్నట్టు మేకర్స్ టీమ్ ప్రకటించింది. 

స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ సమంత యాక్షన్ ఫాంటసీ సిరీస్లో నటించనుంది. తాజాగా వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైనట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు 'ఎప్పటికీ కలలు కనడం ఆపొద్దు. చాలా కాలం తర్వాత మళ్లీ సెట్స్ పైకి రావడం ఆనందంగా ఉంది' అని కామెంట్స్ పెట్టింది. వామికా గబ్బి, ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.