నెపోటిజం పై స్పందించిన స్టార్ హీరోయిన్: అవకాశాలు కోల్పోయా అంటూ..

నెపోటిజం పై స్పందించిన స్టార్ హీరోయిన్: అవకాశాలు కోల్పోయా అంటూ..

టాలీవుడ్ లో వరుస స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కాగా రకుల్ ప్రీత్ సింగ్ మొదటగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుస చిత్రాల్లో నటించే ఆఫర్లు దక్కించుకుంది. 

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం విషయంపై స్పందించింది. ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను కూడా నెపోటిజం ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కొందరు స్టార్ హీరోల పిల్లల చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు కోల్పోయాయనని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తానేమీ బాధ పడలేదని అలాగే నిరాశ చెందకుండా ముందుకు సాగానని పేర్కొంది.  

నెపోటిజం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలలకి ఇండస్ట్రీలో ఏదైనా అవసరం వస్తే కచ్చితంగా సహాయం చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే తమ తల్లిదండ్రులు కష్టపడి పని చెయ్యడంవలన కొంతమేర సులభంగా ఇండస్ట్రీలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందని అంతేగానీ నెపోటిజం ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

కష్టపడి పని చేస్తే కచ్చితంగా ఏ రంగంలోనైనా సక్సస్ వస్తుందని కాబట్టి కష్టపడుతూ ధైర్యంగా ముందుకు సాగాలని నూతనంగా ఇండస్ట్రీకి వచ్చే నటీనటులకు సూచించింది.