మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ఫ్యామిలీతో కలిసి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ (Olympics) వేడుకలు జూలై 26న పారిస్ బెకాన్స్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది అతిథులు ఒలింపిక్స్ ను వీక్షించడానికి తరలి వచ్చారు. అందులో భాగంగా మెగాస్టర్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ పారిస్లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను, వీడియోస్ తాజాగా ఉపాసన (Upasana), హీరో రామ్చరణ్ ఇన్స్టా వేదికగా షేర్ చేశారు.
- ALSO READ | Manchu Vishnu: మేము ఎలాంటి ఈ-మెయిల్స్ చేయలేదు..క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు నిర్మాణ సంస్థ
గత రెండ్రోజుల నుంచి మెగాస్టార్ తన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్లో హైడ్ పార్క్ లో విహరిస్తున్న ఫోటోను పంచుకోగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు పారిస్ వెళ్లిన దగ్గరనుంచి క్లీంకారతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలు చూసినవారంతా ‘ఎంజాయ్ చేయండి’..కానీ, ‘క్లీంకారను చూపండి’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఏదేమైనా బిజీ స్టార్ డమ్ తో ఉన్న సమయంలో తమ ఫ్యామిలీతో ఇలా దేశాలను చుట్టేయడం చాలా బాగుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఫొటోస్ లో మెగా క్వీన్ క్లింకారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. మరోవైపు అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న‘గేమ్ ఛేంజర్’ మూవీలో చెర్రీ పార్ట్ షూటింగ్ ఇటీవల పూర్తైంది.