Veekshanam: థియేటర్స్లోకి మిస్టరీ థ్రిల్లర్గా 'వీక్షణం'.. ఆసక్తి రేపుతోన్న ట్రైలర్ విజువల్స్

Veekshanam: థియేటర్స్లోకి మిస్టరీ థ్రిల్లర్గా 'వీక్షణం'.. ఆసక్తి రేపుతోన్న ట్రైలర్ విజువల్స్

రామ్ కార్తీక్, క‌‌‌‌‌‌‌‌శ్వి జంటగా మ‌‌‌‌‌‌‌‌నోజ్ ప‌‌‌‌‌‌‌‌ల్లేటి దర్శకత్వంలో  పి పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). రేపు అక్టోబర్ 18న థియేటర్స్లో రిలీజవుతుంది. ఈ సందర్భంగా బుధవారం అక్టోబర్ 16న ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు.

రామ్ కార్తీక్ మాట్లాడుతూ ‘మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్స్ నచ్చే ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుంది’ అని చెప్పాడు.  రిలీజ్ కోసం ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నానంది కశ్వి. బెస్ట్ అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ వచ్చిందని, సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌పై కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నామని దర్శకుడు మనోజ్ చెప్పాడు.

ఇందులో నటించడం హ్యాపీగా ఉందని నటులు షైనింగ్ ఫణి, శ్రీనివాస్, బిందు అన్నారు. విజువల్స్ కొత్తగా ఉంటాయని డీవోపీ సాయిరామ్, బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా  ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి చెప్పారు.