అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: రామారావు పటేల్

అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: రామారావు పటేల్

భైంసా/కుభీర్, వెలుగు: ముథోల్ ​నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అభివృద్ధి చేయలేదని.. తనకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్​అన్నారు. ఆదివారం భైంసాలోని కిసాన్​గల్లీలో జెండా ఆవిష్కరించారు. సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ మినహా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకొలేదన్నారు. రామారావు పటేల్​ కొడుకు సందీప్​ పవార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు జరిగాయి.

చుచుంద్​ సర్పంచ్​తో పాటు భైంసా మార్కెట్​కమిటీ డైరక్టర్ ​సురేశ్ పటేల్, గ్రామ అధ్యక్షుడు బాపూరావు, మరో 150 మంది బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్​ మాజీ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్​ గాలి రవికుమార్, తాలోడ్​ శ్రీనివాస్, సోలంకి భీంరావు, పండిత్​పటేల్​తదితరులు పాల్గొన్నారు.