
రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ ఉద్యోగి సత్యసీల్ బీహెచ్ఈఎల్ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తూ ఏడుగురి వద్ద రూ. 5 .40 లక్షలు వసూలు చేశాడు. విషయం గుర్తించిన మల్లన్న గారి విఠల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.