స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోర్యాంకు మెరుగయ్యేనా.. పోటీలో నిలిచిన రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోర్యాంకు మెరుగయ్యేనా.. పోటీలో నిలిచిన రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వివిధ అంశాలపై బల్దియాలో ఢిల్లీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే 
  • గతేడాది 175వ ర్యాంకు.. 

గోదావరిఖని, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు రామగుండం కార్పొరేషన్ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమ్యూనిటీ, పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాయిలెట్లు నిర్వహణపై ఢిల్లీకి చెందిన క్వాలిటీ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు చెందిన ప్రతినిధి బృందం సర్వే చేపట్టింది. ఈ విభాగాల్లో కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును మదింపు చేస్తున్నారు. 2023లో స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 175వ ర్యాంక్​ రాగా, ఈసారి ర్యాంక్​ మెరుగవుతుందనే ఆశాభావంతో రామగుండం కార్పొరేషన్​ యంత్రాంగం ఆశాభావంతో ఉంది. 

శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగుపర్చేందుకు..

దేశంలోని పట్టణాలు, నగరాలలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్​మిషన్​ ఆధ్వర్యంలో ప్రతి యేటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2024లో పోటీ చేసేందుకు రామగుండం కార్పొరేషన్​ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్రం అంగీకరించడంతో మార్చి 5వరకు క్యూఆర్​ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి క్వాలిటీ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ప్రతినిధులు రామగుండం చేరుకున్నారు. కార్పొరేషన్​ పరిధిలో ర్యాండమ్​గా గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి ఇండ్ల యజమానులను కలిసి చెత్త సేకరణపై సర్వే చేస్తున్నారు. అలాగే పబ్లిక్​, కమ్యూనిటీ టాయిలెట్లను పరిశీలించి సెప్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ, కేర్​టేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లీనింగ్, ప్రజల నుంచి ఫీడ్​ బ్యాక్​, టాయిలెట్లకు తలుపులు, వాష్​ బేసిన్​, వాటర్​సప్లై, తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. 

మెరుగైన ర్యాంక్​ కోసం..

రామగుండం కార్పొరేషన్​ ఏరియా 50 డివిజన్లతో 93.87 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి, 2,29,644 జనాభా కలిగి ఉంది. 2017 నుంచి ఇప్పటివరకు మెరుగైన ర్యాంక్​ సాధించాలనే తపనతో యంత్రాంగం పనిచేస్తోంది. 2017లో 191వ ర్యాంక్​, 2018లో 194వ ర్యాంక్​, 2019లో 192వ ర్యాంక్​, 2020లో 211వ ర్యాంక్​, 2021లో 92వ ర్యాంక్​, 2022లో 136వ ర్యాంక్​, 2023లో 175వ ర్యాంక్​ సాధించింది. ప్రస్తుతం కార్పొరేషన్​ పరిధిలో ప్రతి డివిజన్​లో ఉదయం చెత్త సేకరించేందుకు 90 వెహికల్స్​ అందుబాటులో ఉన్నాయి. ఇంటింటికి సేకరించిన చెత్తలో రీయూజ్​ చేసే చెత్తను సిబ్బంది వెంటనే వేరు చేస్తూ గౌతమీనగర్​లోని డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపిస్తున్నారు. 

మానవ వ్యర్థాలను ఎరువుగా మార్చే మల్కాపూర్​లోని ఫీకల్​స్లడ్జ్​ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)ని వినియోగంలోకి తీసుకువచ్చారు. రామగుండం పట్టణంలో సీవరేజ్​ ట్రీట్​మెంట్​ప్లాంట్​ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. రోడ్లమీద చెత్త వేయకుండా ఆయా ఏరియాల్లో ప్రజలకు  అవగాహన కల్పించారు. ఎవరైనా చెత్తను రోడ్లపై వేస్తే వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్​లో మెరుగైన ర్యాంక్​ సాధిస్తామనే ఆశాభావంతో కార్పొరేషన్​ ఆఫీసర్లు ఉన్నారు.