అభివృద్ధి, సంక్షేమమే సర్కార్ లక్ష్యం : ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​

అభివృద్ధి, సంక్షేమమే సర్కార్ లక్ష్యం : ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​

 గోదావరిఖని, వెలుగు: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్​ సర్కార్​లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ అన్నారు. మంగళవారం గోదావరిఖనిలోని ప్రధాన మార్కెట్​లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో రూ.29.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్​ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక ఎవరైనా రోడ్లను పగలగొడతే రూ.5లక్షల ఫైన్​ వేయాలని మున్సిపల్​ ఆఫీసర్లకు సూచించారు.