గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలోని జెన్కో స్థలంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్క్రిటికల్పవర్ ప్లాంట్పనులను ప్రారంభించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్రాజ్ఠాకూర్సీఎం రేవంత్రెడ్డిని కోరారు. శుక్రవారం హైదరాబాద్లో సీఎంను కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఆ పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.