అయోధ్య ప్రజలు సిగ్గుపడాలి : సునీల్ లహరీ

అయోధ్య ప్రజలు సిగ్గుపడాలి : సునీల్ లహరీ
  • ఫైజాబాద్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించడంపై సునీల్ లహరీ ఫైర్

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమి ఉన్న ఫైజాబాద్  లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ ను గెలిపించనందుకు అక్కడి ప్రజలు సిగ్గుపడాలని రామానంద్ సాగర్  రామాయణ్​లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరీ ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించినా.. ఓటర్లు బీజేపీని ఓడించడం సిగ్గుచేటు అని ఆయన ఇన్ స్టాగ్రాం స్టోరీలో పేర్కొన్నారు. అయోధ్య వాసులు తమ రాజుకు ద్రోహం చేశారని అన్నారు.

సీతామాతను అనుమానించింది ఈ అయోధ్య ప్రజలే. ఇప్పుడు కూడా తమ రాజును ఓడించిన స్వార్థపరులుగా నిలిచారు”అని సునీల్ లహరీ విమర్శించారు.