సంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ గా రామచందర్ నాయక్

సంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ గా రామచందర్ నాయక్

కంది, వెలుగు : సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గురువారం రాథోడ్ రాంచందర్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం కమిటీ ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, సభ్యులుగా యశోద, రంగయ్య, చంద్రయ్య, సయ్యద్ మోయిజుద్దీన్, నర్సింహారెడ్డి, మహేశ్, మోహన్ రావు, బుచ్చిలింగం, రాధాకృష్ణ, దూదిసింగ్, రవీందర్​రెడ్డి, జితేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా రామచందర్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవిలు రావడానికి కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో పాటు పార్టీ హైకమాండ్​కు కృతజ్ఞతలు తెలిపారు.