
భద్రాచంలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో రాములోరు సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ కార్యక్రమాన్ని ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి తెలుగులు రాష్ట్రాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.స్వామి, అమ్మ వారి కల్యాణాన్ని చూసి ఆనందపడిపోయారు.
భక్తుల రామ నామస్మరణతో భద్రాచలం వీధులన్నీ మార్మోగాయి. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.