
కొత్తకోట, వెలుగు: పట్టణానికి చెందిన నాటు వైద్యుడు రాములు నిర్వహిస్తున్న శ్రీ ధన్వంతరి సాయిరాం ఆయుర్వేద మోకాళ్ల నొప్పులకు ఇచ్చే మందులను ఆయూష్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ హేమలత పరిశీలించారు. రాములు తయారు చేసే మందును టెస్టింగ్ కోసం తీసుకెళ్లారు. రిపోర్ట్ వచ్చేంత వరకు ఎలాంటి మందులు అమ్మవద్దని సూచించారు. రాములు నడుపుతున్న క్లినిక్ను సీజ్ చేశారు. టెస్టింగ్కు పంపిన మందుపై రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. డీఎంహెచ్వో జయచంద్ర, జె మధు పాల్గొన్నారు.