బాలాపూర్లో బీటెక్ స్టూడెంట్ను చంపింది స్నేహితులే

బాలాపూర్లో బీటెక్ స్టూడెంట్ను చంపింది స్నేహితులే

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ బిటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్యను పోలీసులు చేధించారు. మర్డర్ చేసింది ప్రశాంత్ స్నేహితులుగా గుర్తించారు. నిన్న బాలాపూర్ చౌరస్తాలో మండి 37 అరేబియన్ రెస్టారెంట్ దగ్గర MVSR ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి ప్రశాంత్ ను ముగ్గురు హత్యచేసినట్లు తెలిపారు.

 మృతుడు ప్రశాంత్, నిందితులు ముగ్గు ఒకే బస్తీలో ఉంటున్నట్లు గుర్తించామన్నారు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.