
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణానికి చెందిన గంజి వైష్ణవి వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. 13 నిమిషాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల పేర్లను రాసినందుకు గాను ఆమెను వరల్డ్ రికార్డ్ఆఫ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎంపిక చేశారు. పట్టణానికి చెందిన గణేశ్, హారిక దంపతుల కూతురైన వైష్ణవి పట్టణంలోని ప్రైవేట్స్కూల్లో టెన్త్ చదువుతోంది. ఆమెకు రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ అవార్డును అందించి అభినందించారు.