![కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ?](https://static.v6velugu.com/uploads/2023/10/Rangareddy-DCCB-Chairman-Manohar-Reddy_htEO4R3DSN.jpg)
పరిగి, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నేత మనోహర్ రెడ్డి గురువారం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ విషయంపై బుధవారం రాత్రి మనోహర్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితుడినైనట్లు చెప్పారు. ఎలాంటి టికెట్ ఆశించడం లేదని, పార్టీపై అభిమానంతో వెళుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై గురువారం కాంగ్రెస్ పెద్దలతో కలిసి మీడియా ముందు వెల్లడించడానికి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది.