ట్రాఫిక్ తిప్పల్లేకుండా విజయవాడకు ఈ- గరుడ బస్సులు

ట్రాఫిక్ తిప్పల్లేకుండా విజయవాడకు ఈ- గరుడ బస్సులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పటాన్​చెరు, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం బీహెచ్ఈఎల్ డిపో నుంచి కొత్తగా ఓఆర్ఆర్ మీదుగా కొత్తగా రెండు ఈ గరుడ బస్సులను సోమవారం ప్రారంభించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్​ఎం శ్రీలత తెలిపారు. ఈ బస్సులు రామచంద్రాపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియన్ టౌన్​షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భూజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాం నగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వెళ్తాయని తెలిపారు. ఈ రూట్​ వల్ల విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయన్నారు. ప్రతిరోజూ రాత్రి 9:30, రాత్రి10:30కురామచంద్రాపురం నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు.