మరో పిల్లల మర్రి.. ఈదమ్మమర్రి.. ఎక్కడుందో తెలుసా..

మరో పిల్లల మర్రి.. ఈదమ్మమర్రి.. ఎక్కడుందో తెలుసా..

పిల్లల మర్రి అనగానే అందరికీ మహబూబ్​ నగర్​ కు దగ్గరలో ఉన్న మర్రి చెట్టే గుర్తొస్తుంది. కానీ.. అలాంటిదే మన రాష్ట్రంలో మరొకటి కూడా ఉంది. సుమారు రెండెకరాల్లో విస్తరించి ఉన్న ఈ వృక్షాన్ని ఈదమ్మ మర్రి అని పిలుస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల వయసున్న ఈ చెట్టు కథాకమామిషు ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కుకునూరులో దన్నె శంకరయ్య అనే రైతు పొలంలో ఉంది ఈ మర్రి వృక్షం. ఈ చెట్టు కింద ఈదమ్మ తల్లి కొలువై ఉన్నదని నమ్ముతుంటారు.  దీనికి ఈదమ్మ మర్రిగా పేరొచ్చింది. గతంలో ఈ ప్రాంతాన్ని వాసోర్డ్ అనే స్వచ్ఛంద సంస్థ టూరిస్ట్ ప్లేస్ గా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అందుకు రైతు శంకరయ్య కూడా అంగీకరించాడు. తనకున్న మూడెకరాలను తిరిగి ఎవరికీ అమ్మకూడదనే షరతుతో ఆ సంస్థకు అమ్మాడు. వాసోర్డ్ ఈ స్థలాన్ని కొన్న తర్వాత ఇక్కడ చాలా డెవలప్ చేసింది. లైబ్రరీ ఏర్పాటు చేశారు. 

పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టి, అకామిడేషన్ ఇచ్చి చదువు చెప్పించారు. పోలాండ్ నుంచి జగోదా, స్పెయిన్ నుంచి వియోలత అనే ఇద్దరు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉన్నారు. ఇక్కడి స్టూడెంట్లకు పాఠాలు కూడా చెప్పారు. అప్పుడు ఈ ప్రాంతం చాలా డెవలప్ అయ్యింది. ఇక్కడ కొన్ని సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ కూడా జరిగాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాసోర్డ్ సంస్థ వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయా రు. దాంతో మళ్లీ పాత కథే ముందుకొచ్చింది.  ఇంత ప్రాముఖ్యం ఉన్నా ఈ చెట్టును  ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడంలేదు. దీన్ని టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తామంటేనే   దన్నె శంకరయ్య ఈ చెట్టు ఉన్న స్థలాన్ని 'వాసోర్డు' సంస్థకు అమ్మారు. వాళ్లు ఉన్నంతకాలం బాగానే డెవలప్ చేశారు. కానీ.. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
 ఆ సంస్థ కట్టించిన భవనాల్లోని ఫర్నీచర్, వస్తువులు అన్నీ దొంగలు ఎత్తుకుపోయారు.

ఈదమ్మతల్లికి శ్రావణమాసంలో బోనాలు..

ఈ చెట్టు కింద వెలిసిన ఈదమ్మ తల్లికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులు సంబురాలు చేస్తారు. ఇదే ఊరికి చెందిన చింతల దామోదర రెడ్డి ప్రతి ఏటా ఈదమ్మ తల్లికి బండి బోనం సమర్పిస్తారు. ఊళ్లో వాళ్లంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అంతేకాదు ఊళ్లో రైతులు తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని మొదటగా తల్లికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాతే వాళ్లు తింటారు. 

పర్యాటక కేంద్రంగా మార్చాలి.... 

ఈ చెట్టు కింద ఈదమ్మ తల్లి ఉందనే కారణంగా ఎండిపోయి కింద పడిన ఈ చెట్టు కొమ్మలను ఎవరూ కాల్చరు. పొయ్యిల కట్టెలుగా కూడా వాడరు. ఈ చెట్టు ఉన్న ప్రదేశాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మారిస్తే బాగుండు అంటున్నారు ఆ ఊరి ప్రజలు.   ఈ మహావృక్షాన్ని  ఆ గ్రామస్తులు అంతా కలసి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. దీన్ని ఎవరైనా డెవలప్ చేయడానికి ముందుకొస్తే గ్రామస్తులు  అంతా సాయంచేస్తామంటున్నారు  స్థానికులు.  మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. .