కామారెడ్డిలో రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​ ప్లాగ్ మార్చ్​

కామారెడ్డిలో రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​ ప్లాగ్ మార్చ్​

కామారెడ్డి టౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం  రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​, స్థానిక ఏఆర్​ బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్​ నిర్వహించారు. రైల్వే స్టేషన్​ నుంచి ప్రారంభమైన మార్చ్​ స్టేషన్​ రోడ్డు, డెయిలీ మార్కెట్​, సుభాష్​రోడ్డు, జేపీఎన్​ చౌరస్తా,   పాంచ్ చౌరస్తా, బడా మసీద్ రోడ్డు, పెద్దబజార్, రైల్వే కమాన్​, నిజాంసాగర్​చౌరస్తా,  కొత్త బస్టాండు, అశోక్​నగర్​ కాలనీ రోడ్డు, పాత బస్టాండు, బతుకమ్మ కుంట మీదుగా సాగింది.  ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యారెడ్డి మాట్లాడుతూ ఆర్ఎఫ్​  జిల్లా భౌగోళిక పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ ప్లాగ్​ మార్చ్​ నిర్వహిస్తున్నారన్నారు.   

ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, మత ఘర్షణలు జరిగినప్పుడు రాపిడ్​ ​ యాక్షన్​ ఫోర్స్ వచ్చి స్థానిక పోలీసులకు సాయం చేస్తారన్నారు. మేమున్నామని  ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ ప్లాగ్​ మార్చ్​ నిర్వహించామన్నారు.  ఏఆర్ డీఎస్పీ యాకుబ్​రెడ్డి,  టౌన్​ సీఐ చంద్రశేఖర్​, ఆర్​ఐలు సంతోశ్​​కుమార్,  కృష్ణ , రాపిడ్​  యాక్షన్​ ఫోర్స్​  డిప్యూటీ కమాండెంట్​ టీపీ బగేల్​, ఇన్​స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వర్​రావు,  సిబ్బంది పాల్గొన్నారు.