
హైదరాబాద్, వెలగు:సాఫ్ట్ డ్రింకులు తయారు చేసే రస్నా ఇండియా రస్నా రిచ్ను ప్రవేశపెట్టింది. ఇది పౌడర్ కాన్సంట్రేట్. ఒక్కో ప్యాకెట్తో మూడు గ్లాసుల డ్రింక్తయారు చేయవచ్చని కంపెనీ తెలిపింది. రస్నా రిచ్ మామిడితో పాటు ఆరెంజ్, నిమ్మ, అనాస, జామ మిక్స్ ఫ్రూట్ వంటి రుచుల్లో కూడా లభిస్తుంది. ధరలు రూ.10–20 మధ్య ఉంటాయి.
పోటీ కంపెనీ ప్రొడక్టులతో పోలిస్తే రస్నా రిచ్ రస్నా రిచ్ అతి తక్కువ ధరలో ప్రీమియం రుచిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో 21 విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది. స్కూల్స్, పిక్నిక్స్, ప్రయాణాల్లో ఉపయోగించవచ్చు.