Ashwin All-Time IPL XI: కెప్టెన్‌గా ధోనీ.. ఆల్‌టైం ఐపీఎల్ జట్టును ప్రకటించిన అశ్విన్

Ashwin All-Time IPL XI: కెప్టెన్‌గా ధోనీ.. ఆల్‌టైం ఐపీఎల్ జట్టును ప్రకటించిన అశ్విన్

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్-టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ 11 ను ఎంచుకున్నాడు. తన జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని సెలక్ట్ చేశాడు. మూడో స్థానంలో సురేష్ రైనా బ్యాటింగ్ కు వస్తాడు. సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ధోనీ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తారు. 

ALSO READ | PAK vs BAN 2024: అఫ్రిది లేకుండానే పాక్ తుది జట్టు.. స్పష్టం చేసిన ప్రధాన కోచ్

ఆల్ రౌండర్లుగా ఇద్దరు ఫారెన్ ప్లేయర్లను ఎంచుకున్నాడు. ప్రపంచంలోనే టాప్ స్పిన్నర్లు నరైన్, రషీద్ ఖాన్ లకు తన జట్టులో చోటిచ్చాడు. పేస్ బౌలర్లగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, యార్కర్ల వీరుడు జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ మలింగ మరో పేసర్. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జడేజా లాంటి స్టార్ ఆటగాళ్లకు చోటు కల్పించలేదు. 

రవిచంద్రన్ అశ్విన్ ఆల్-టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ 11 జట్టు:

మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.