ఆర్​బీఐకి డిజిటల్ ​ట్రాన్స్​ఫర్మేషన్​ అవార్డు

ఆర్​బీఐకి డిజిటల్ ​ట్రాన్స్​ఫర్మేషన్​ అవార్డు

న్యూఢిల్లీ: డిజిటల్​ కార్యక్రమాలు చేపట్టినందుకు రిజర్వ్​ బ్యాంక్​ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) ‘డిజిటల్ ​ట్రాన్సఫర్మేషన్​అవార్డు 2025’కు ఎంపికయింది. యూకే సెంట్రల్​ బ్యాంకు దీనిని ప్రదానం చేస్తుంది. ఆర్​బీఐ ప్రవాహ్​, సారథి అనే రెండు డిజిటల్​ కార్యక్రమాలను చేపట్టింది. వీటిని సంస్థ డెవలపర్​ టీమే అభివృద్ధి చేసింది. సారథిని 2023 జనవరిలో అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కంపెనీలు రికార్డులను సురక్షితంగా స్టోర్​ చేయవచ్చు. 

సారథి వల్ల కాగితం వాడకం చాలావరకు తగ్గిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. యూజర్లు ఆర్​బీఐకి సులభంగా రెగ్యులేటరీ అప్లికేషన్లను అందజేయడానికి ప్రవాహ్​ను గత ఏడాది మేలో అందుబాటులోకి తెచ్చారు. ఈ పోర్టల్​లోని డాక్యుమెంట్లు అన్ని ఆర్​బీఐ ఆఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. ప్రవాహ్ ​ద్వారా ఇప్పటి వరకు 70 రెగ్యులేటరీ అప్లికేషన్లను డిజిటైజ్​ చేశారు.