ఏదో చేస్తున్నారు : 7 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు ఇంకా జనం దగ్గరే ఉన్నాయ్

ఏదో చేస్తున్నారు : 7 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు ఇంకా జనం దగ్గరే ఉన్నాయ్

రూ.రెండు వేల  నోట్ల రద్దు చేసిన తర్వాత 97.87శాతం రూ.వేల నోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయని సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7వేల 755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది. 2023 మే 19న రూ.2వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. చలామణి రద్దు చేసినప్పటికీ ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. అయితే 2024 అక్టోబర్‌ 7దాకా దేశంలోని అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. 

గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే రెండు వేల నోట్ల మార్పిడి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.