బ్యాంకింగ్​ సిస్టమ్​ను ఆరోగ్యంగా ఉంచేందుకు చర్యలు

బ్యాంకింగ్​ సిస్టమ్​ను ఆరోగ్యంగా ఉంచేందుకు చర్యలు

ముంబై: మన బ్యాంకింగ్​ సిస్టమ్​ పటిష్టంగా ఉందని, విదేశాలలోని పరిణామాలను తట్టుకోగలదని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు. జాక్సన్​ హోల్​ ఫెడ్​రిజర్వ్​ చైర్మన్​ ప్రసంగాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్​ సిస్టమ్​ను ఆరోగ్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్​బీఐ చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎక్కువ ఫారెక్స్​ రిజర్వులను ​ అట్టేపెట్టడం ఈ దిశలోదేనని చెప్పారు. జాక్సన్​ హోల్ సమ్మిట్​ తర్వాత గత వారం రోజులుగా గ్లోబల్​ మార్కెట్లన్నీ భారీగా పడుతున్నాయి. ఈ ఎఫెక్ట్​ ఎమర్జింగ్​ మార్కెట్లపైనా పడుతోంది.  ఆర్​బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల మన మార్కెట్లు పటిష్టంగా నిలబడుతున్నాయని దాస్​ చెప్పారు.