
హైదరాబాద్, వెలుగు : అధిక రక్తపోటు చికిత్స కోసం మెడ్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సింప్లిసిటీ స్పైరల్ రీనల్ డినర్వేషన్ సిస్టమ్ (ఆర్డీఎన్)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అధిక రక్తపోటుతో దెబ్బతినే కిడ్నీ సమీపంలోని నరాలకు ఇది చికిత్స చేస్తుంది. ఈ విధానంలో రోగికి మత్తుమందు ఇచ్చిన తర్వాత, మూత్రపిండాలకు దారితీసే ధమనిలోకి చాలా సన్నని గొట్టాన్ని (కాథెటర్) చొప్పిస్తారు. మూత్రపిండాల్లో నరాల కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఆర్డీఎన్ అనేది మినిమల్లీ ఇన్వేసివ్ థెరపీ. అంటే శరీరానికి చిన్న గాటు పెడతారు. దీని ద్వారానే కాథెటర్ను లోపలికి పంపుతారు.