వరదలతో ప్రాణ నష్టం జరగకుండా చూడాలి : ఆర్డీవో దామోదర్

వరదలతో ప్రాణ నష్టం జరగకుండా చూడాలి : ఆర్డీవో దామోదర్

భద్రాచలం, వెలుగు : గోదావరి వరదలతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తీర ప్రాంత ఆఫీసర్లను ఆర్డీవో దామోదర్​ ఆదేశించారు. ఆర్డీవో ఆఫీసులో మంగళవారం నేషనల్​ డిజస్టర్​ రెస్పాన్స్​ టీమ్​ సారధ్యంలో గోదావరి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడు మండలాల తహసీల్దార్లు, సెక్టోరియల్​ఆఫీసర్లు, పోలీసులతో రివ్యూ మీటింగ్​ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఆఫీసర్లంతా అలర్ట్ గా ఉండాలన్నారు.  తీర ప్రాంతంలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులకు మండల స్థాయిలో ఆఫీసర్లు హాజరు కావాలన్నారు. ఈ రివ్యూ మీటింగ్​లో జాతీయ విపత్తుల స్పందన దళం కమాండర్​భూపేందర్​ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.