ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్
  • ప్రిపరేషన్స్​లో మన సైన్యం
  • ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​

న్యూఢిల్లీ:పాకిస్తాన్​ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు మన సైన్యం రెడీగా ఉంది. అన్ని రకాల ప్రిపరేషన్స్​ను కొనసాగిస్తున్నది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వివరించారు. పహల్గాం​ టెర్రర్​ అటాక్​ నేపథ్యంలో భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి తెలియజేశారు. 

సోమవారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో రాజ్​నాథ్​ సింగ్​ కలిశారు.  దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​  జనరల్​అనిల్​ చౌహాన్​తో ఆదివారం తాను చర్చించిన అంశాలను మోదీకి రాజ్​నాథ్​ వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం ప్రిపరేషన్స్​లో ఉందని పేర్కొన్నారు.