రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ ఉద్యోగినిపై.. ఎగ్జిక్యూటివ్స్ లైంగిక దాడి

రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ ఉద్యోగినిపై.. ఎగ్జిక్యూటివ్స్ లైంగిక దాడి

హైదరాబాద్ లో దారుణం జరిగింది. యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు లైంగిక దాడికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళ్తే కడప నుంచి హైదరాబాద్ నగరానికి జాబ్ కోసం వచ్చి ఉప్పల్ లో ఉంటున్న యువతికి మియాపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా జాబ్ వచ్చింది. దీంతో యువతి తన సీనియర్స్ వద్ద శిక్షణ పొందుతూ ఉద్యోగం కొనసాగిస్తుంది. 

ఈ క్రమంలోనే అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న  సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు యువతిపై కన్నేశారు. సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు కేటుగాళ్లు. సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ అత్యాచారాని యత్నించారు.  వారి నుండి తప్పించుకున్న యువతి అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది.  

జీరో ఎఫ్ ఐ ఆర్ కింద ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.  అక్కడి నుండి మియాపూర్ కు కేసు బదిలీ చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.