- 16 మందిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్
- 40 మందిపై బీజేపీ వేటు
ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తు న్నాయి. అయితే ఆయా పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా మారారు. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారిపై చర్యలు చేపట్టాయి. 16 మంది రెబల్ అభ్యర్థులను కాంగ్రెస్ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
సోనాల్ కోవ్, అభిలాషా గవతురే, ప్రేంసాగర్ గన్వీర్, అజయ్ లంజేవార్, విలాస్ పాటిల్, హన్స్కుమార్ పాండే, కమల్ వ్యావరే, మోహన్రావ్ దండేకర్, మంగళ్ భుజ్బల్, మనోజ్ సిండే, విజయ్ ఖడ్సే, షబీర్ ఖాన్, అవినాష్ లాడ్, యాజ్ఞవల్క్య జిచ్కర్, రాజేంద్ర ములక్, రాజేంద్ర ములక్, ఆనందరావును పార్టీ నుంచి బహిష్కరించారు.
ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఉత్తర్వులిచ్చారు. మరోవైపు బీజేపీ కూడా ఇదే తరహా చర్యలు చేపట్టింది. పార్టీకి విరుద్ధంగా వ్యవహరించి 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెబల్స్గా పోటీ చేస్తున్న వారిలో 40 మంది నేతలు, ఆఫీస్ బేరర్లను బహిష్కరించింది.