
- క్వింటాకు రూ.11.010
- గత ఏడాది ధర రూ. 7వేలే...
వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపుకు రికార్డు ధర పలికింది. హన్మకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన గోల్కొండ సదయ్య అనే రైతు సోమవారం మార్కెట్లోని సత్యసాయి ట్రేడర్స్కు 10 బస్తాల పసుపు తీసుకువచ్చాడు. మేలు రకం పసుపు కావడంతో క్వింటాలుకు రూ.11,010 ధర పలికింది. 2013లో క్వింటాల్ పసుపుకు ఏకంగా 16,000 ధర పలికి రికార్డు సృష్టించింది.
గత ఏడాది ఇదే సీజన్లో రూ.7వేలు కూడా దాటలేదు. డిమాండ్కు అనుగుణంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో పసుపుకు అధిక ధర వస్తోందని, వచ్చే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్కార్యదర్శి రాహుల్ తెలిపారు.