
ఖైరతాబాద్, వెలుగు: రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్మల్లన్న) అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే భేషరుతుగా తమ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి డిమాండ్చేశారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
తీన్మార్మల్లన్న క్షమాపణ చెప్పకపోతే వెంటనే కాంగ్రెస్పార్టీ నుంచి సస్పెండ్చేయాలని కోరారు. ఇప్పటికే ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. గాంధీ భవన్వద్ద నిరసన తెలిపామన్నారు. తీన్మార్మల్లన్న వ్యాఖ్యలను నిరసిస్తూ మార్చి 11న ట్యాంక్బండ్పై రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ‘రెడ్డి మార్చ్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.