
కామారెడ్డిటౌన్, వెలుగు : అగ్ర వర్ణ పేదలకు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ వర్తింప జేయాలని కోరుతూ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్కు వినతి పత్రం అందించారు. అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అగ్రవర్ణ పేద కుటుంబాలకు వర్తింప జేయాలన్నారు.
రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్రెడ్డి, కోర్ కమిటీ ఛైర్మన్ నాగిర్తి చంద్రారెడ్డి, ప్రతినిధులు రాజారెడ్డి, మోహన్రెడ్డి, నర్సారెడ్డి, రవీందర్రెడ్డి, సతీష్రెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.