
చైనా మొబైల్ మేకర్ షియోమీ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. రెడ్మీ నోట్ 7 ప్రొ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 6.3 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, 6GB ర్యామ్లను అమర్చారు. వెనుక భాగంలో 48MP భారీ కెపాసిటీ కలిగిన కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 13MP కెమెరా ఉంది. దీనికి AI ఫేస్ అన్లాక్ ఫీచర్ను అందిస్తున్నారు. డిస్ప్లే కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4000MAH భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు.
రెడ్మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు…
…6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
… 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
… గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్
… 4/6 GB ర్యామ్, 64/128 GB స్టోరేజ్, 256GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్
… ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
…48, 5MP డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13MP సెల్ఫీ కెమెరా
…ఫింగర్ ప్రింట్ సెన్సార్, IRసెన్సార్, డ్యుయల్ 4G వీవోఎల్టీఈ
… డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, USB టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
రెడ్మీ నోట్ 7 ప్రొ స్మార్ట్ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధరకు, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు లభ్యం కానున్నాయి. ఫ్లిప్కార్ట్ సైట్తోపాటు MI ఆన్లైన్ స్టోర్లో ఈ ఫోన్లను మార్చి 13వ తేదీ నుంచి అమ్మనున్నారు.