ఆర్వోఆర్ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ

ఆర్వోఆర్ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ
  •  అర్హులకే సర్కార్ పథకాలు అందిస్తం
  • క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నయ్​
  • ప్రజల సొమ్మును జాగ్రత్తగా పంచుతం
  •  వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

హైదరాబాద్: ప్రజల సొమ్మును జాగ్రత్తగా పంచి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అర్హులకే సర్కార్ పథకాలు అందిస్తామని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నాయని, అక్రమార్కులపై ఫోకస్​చేసిందని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు పదే పదే విమర్శలు చేయొద్దని సూచించారు. రుణమాఫీ జరగకపోతే ఎవర్ని సంప్రదించాలో జీవోలో వివరాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 6 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని, అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.  

రైతు భరోసా విషయంలో తాము ఎప్పుడు మాయ మాటలు చెప్పలేదన్నారు. త్వరలోనే ధరణిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్​రైట్స్)​ చట్టంపై ఇప్పటికే చాలా మంది మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సలహాలు సేకరించామని.. త్వరలో ప్రజాభిప్రాయాలను తీసుకుంటామని పేర్కొన్నారు.

ALSO READ | కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆర్థిక సంక్షోభం: రాకేశ్ ​రెడ్డి