
- స్థలాన్ని రిజిస్ట్రేషన్చేయించుకున్న బీఆర్ఎస్ లీడర్
- నాలుగేండ్ల తర్వాత బయటపడిన అక్రమాలు
నర్సంపేట/నల్లబెల్లి , వెలుగు: అతనో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కొడుకు.. ఏకంగా శ్మశానవాటిక ల్యాండ్ను తన పేరుపై రిజిస్ట్రేషన్చేయించుకున్నాడు. నాలుగేండ్లుగా రైతుబంధు సైతం పొందుతున్నాడు. వరంగల్జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట విలేజ్ కోసం గుండ్లపహాడ్ విలేజ్పరిధిలోని సర్వే నంబర్ 211/ఏ/2/1లో 26 గుంటల భూమిని శ్మశానవాటిక, డంపింగ్యార్డుల కోసం ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసింది. ఆ స్థలంలో డంపింగ్యార్డుతోపాటు వైకుంఠధామం నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి.
సర్పంచ్కొడుకు వక్కల చంద్రమౌళి శ్మశానవాటిక, డంపింగ్యార్డుకు గతంలో భూమిని అమ్మిన వ్యక్తితో మాట్లాడి 15 గుంటల ల్యాండ్ను 211/ ఏ /2/2 బై నంబర్తో తన పేరుపై రిజిస్ట్రేషన్చేయించుకున్నాడు. కొంతకాలం నుంచి రైతుబంధును సైతం తీసుకుంటున్నాడు. ఆనోట ఈ నోటా విషయం గురువారం బయటపడింది. దీనిపై ఎంపీఈఓ కూచన ప్రకాశ్, ఎంపీడీఓ విజయ్కుమార్వివరణ కోరగా ఇప్పుడే విషయం తమకు తెలిసిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.