
విదేశాల్లో పీజీ, పీహెచ్డీ చదవాలను కునే మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం ఫర్ మైనారిటీస్ పథకం రిజిస్ట్రేషన్లు ప్రారంభ మయ్యాయి. సెప్టెంబర్ 27 వరకు ఆన్లైన్లో అప్లైచేసుకోవచ్చు. ఈ పథకం కింద 500 మందికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్లో స్టడీస్ కోసం వెళ్లేవారు మాత్రమే అర్హులు. TOEFL/ IELTS/GRE/GMAT లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండి ఫారెన్ వర్శిటీలో అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన సంవత్సరం లోపు జాయినై ఉండాలి. ఏటా ఆగస్టు/సెప్టెంబర్, జనవరి/ఫిబ్రవరిలో రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశముంది. మహిళలకు 33 శాతం స్కాలర్షిప్స్ కేటాయించారు.
అర్హత: ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, మెడిసిన్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు 2019 జూలై 1 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఒక కుటుంబంలో ఒకరికే ఆర్థిక సాయం చేస్తారు. కుటుంబ ఆదాయం రెండు లక్షలకు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్ తదితరులతో కూడిన స్టేట్ లెవెల్ స్ర్కీనింగ్ కమిటీ దరఖాస్తులను విశ్లేషించి లబ్దిదారులను ఎంపిక చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.5 లక్షల చొప్పున రెండు ఇన్స్టాల్మెంట్లలో 10 లక్షల స్కాలర్షిప్ అందిస్తారు. వీరు 5 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ కూడా పొందొచ్చు. అభ్యర్థులు ఫండ్స్ను ఏ విధంగా ఖర్చే చేశారో సంవత్సరం చివర యుటిలిటీ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్లకు చివరితేది:2019 సెప్టెంబర్ 27
వెబ్సైట్:www.telanganaepass.cgg.gov.in