మెరుగైన విద్యుత్ అందించాలి: టీజీఎన్​పీడీసీఎల్​ సీఎండీ వరుణ్​రెడ్డి

మెరుగైన విద్యుత్ అందించాలి: టీజీఎన్​పీడీసీఎల్​ సీఎండీ వరుణ్​రెడ్డి

హనుమకొండ, వెలుగు: మెరుగైన, నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని టీజీఎన్​పీడీసీఎల్​సీఎండీ వరుణ్​రెడ్డి సూచించారు.  హనుమకొండ నక్కలగుట్ట విద్యుత్ భవన్ లో సోమవారం సంస్థ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి మాట్లాడారు. 

లోడ్ పెరిగే చాన్స్ ఉన్న ఏరియాల్లో  పవర్ ట్రాన్స్​ఫార్మర్లు,  ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.  వచ్చే నెలలో పంట కోతలు పూర్తవుతాయని, ఆ తర్వాత వ్యవసాయ సర్వీసులను త్వరితగతిన రిలీజ్​చేయాలని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్ చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్,  టి.మధుసూదన్ ఉన్నారు.