
తిమ్మాపూర్, వెలుగు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్, రిజర్వాయర్ నుంచి మోయ తుమ్మెద వాగు నుంచి 21,102 క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో అధికారులు ఆదివారం కాకతీయ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్లో 24 టీఎంసీలకు గాను.. 21.102 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు. ఇదిలాఉంటే రిజర్వాయర్ లోకి వరద మరింత పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.