
- రిలయన్స్, బీపీలను ఆదేశించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ సమీప బ్లాక్ నుంచి సహజ వాయువును ఉత్పత్తి చేయడం, అమ్మడం ద్వారా భారీ లాభాలను ఆర్జించినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటిష్పెట్రోలియం (బీపీ)లు 2.81 బిలి యన్ డాలర్లు (సుమారు రూ. 24,500 కోట్లు) చెల్లించాలంటూ కేంద్రం డిమాండ్ నోటీసు పంపింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసు జారీ అయింది. ఓఎన్జీసీ సమీప బ్లాకుల నుంచి గ్యాస్ తీసుకున్నందుకు ఇవి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
హైకోర్టు ఈ తీర్పును తోసిపుచ్చింది. దీంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ డిమాండ్ నోటీసులు పంపిందని రిలయన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. కేడీజీ–6లో రిలయన్స్కు 60 శాతం వాటా ఉండగా, బీపీకి 30 శాతం, కెనడియన్ సంస్థ నికోకు మిగిలిన 10 శాతం వాటా ఉంది. తదనంతరం రిలయన్స్, బీపీలు.. నికో వాటాను స్వాధీనం చేసుకున్నాయి.