గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి .. కంది జైలులో ఘటన

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి .. కంది జైలులో ఘటన

సంగారెడ్డి, వెలుగు: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కందిలోని జిల్లా జైలులో రిమాండ్​ ఖైదీ వెంకట్(39)కు శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు గుండెపోటు వచ్చింది. వెంటనే జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లగా  గేటు ముందే కుప్ప కూలిపడిపోయాడు. 

డాక్టర్లు వచ్చి అతడిని పరిశీలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.  కంది జైలు అధికారులు వెంకట్​మృతిని అధికారికంగా ప్రకటించారు. మెదక్​జిల్లా నర్సాపూర్​టౌన్ కు చెందిన వెంకట్​ గంజాయి కేసులో పట్టుబడి ఈనెల 3న కంది జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చాడు.