నా కొడుకు తిరిగొచ్చాడు: మగబిడ్డకు జన్మనిచ్చిన రేణుకా స్వామి భార్య

నా కొడుకు తిరిగొచ్చాడు: మగబిడ్డకు జన్మనిచ్చిన రేణుకా స్వామి భార్య

బెంగుళూర్: కర్నాటకలో రేణుకా స్వామి మర్డర్ కేసు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కన్నడ నటుడు దర్శన్, అతడి గ్యాంగ్ కలిసి రేణుకా స్వామి అనే వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం నటుడు దర్శన్, అతడి ఫ్రెండ్స్ ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రేణుకా స్వామి తండ్రి అయ్యాడు. 2024, అక్టోబర్ 16న రేణుకా స్వామి భార్య సహానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రేణుకా స్వామి హత్యకు గురైన సమయంలో సహానా ఐదు నెలల గర్భంతో ఉండగా.. ఇవాళ (అక్టోబర్ 16) బిడ్డకు జన్మనిచ్చింది. రేణుకా స్వామి తండ్రి కావడంతో అతడి తండ్రి కాశీనాథయ్య సంతోషం వ్యక్తం చేశాడు. 

మనువడిని చూసి కన్నీంటిపర్యంతమైన కాశీనాథయ్య.. తన కొడుకు మళ్లీ తిరిగొచ్చాడంటూ ఎమోషనల్ అయ్యారు. తన కోడలికి ఉచిత ప్రసవం చేసిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, రేణుకా స్వామి హత్య కేసుపై మాట్లాడుతూ.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఈ కేసును విచారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్, అతని భాగస్వామి పవిత్ర గౌడ బెయిల్ పిటిషన్‌లను రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును రేణుకా స్వామి ఫ్యామిలీ మెంబర్స్ స్వాగతించారు.

ALSO READ | Bigg Boss: యాంకర్ విష్ణు ప్రియ మాట‌ల‌కు ఏడ్చేసిన గంగవ్వ.. వీడియో వైరల్

కాగా, తన ప్రియురాలు పవిత్ర గౌడ్‎కు రేణుకా స్వామి సోషల్ మీడియాలో అసభ్యకర మేసేజ్‎లు పెట్టాడనే అనుమానంతో యాక్టర్ దర్శన్ అతడి ఫ్రెండ్స్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేశారు. అనంతరం రేణుకా స్వామిని చిత్రహింసలకు గురి చేయడంతో అతడు మృతి చెందాడు. రేణాకా స్వామి హత్య కన్నడ సినీ, పొలిటికల్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దీంతో ఈ హై ప్రొఫైల్ కేసును కర్నాటక పోలీసులు సీరియస్‎గా తీసుకున్నారు. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారన్న అభియోగాలపై దర్శన్, పవిత్రగౌడ్, మరో 15 మందిని జూన్ 11న అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా దర్శన్, పవిత్ర జైలులో ఉన్నారు.