ఖమ్మం టౌన్, వెలుగు : ప్రతి షాపునకు లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఉండాలని, లేకపోతే షాపును సీజ్ చేస్తామని కేఎంసీ అధికారులు హెచ్చరించారు. శనివారం నగరంలోని గాంధీ చౌక్, కమర్షియల్ ఏరియాలో బిల్ కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో కలిసి ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కేఎంసీ ఆఫీస్ లో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్..కేఎంసీ ఆఫీస్లో ఎల్ఆర్ఎస్కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. మార్చి 31 లోపు ఫీజు పే చేసి ప్రొసీడింగ్ పొం దాలని సూచించారు.