
లిబర్టీ లోని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ విజయలక్ష్మి తో కలిసి కమిషనర్ ఇలంబరితి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ,జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సిబ్బందితో కలిసి , జాతీయ గీతాన్ని ఆలపించారు. రిపబ్లిక్ డే విశిష్టత గురించి వివరించారు.