IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి

IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 రూల్స్ వచ్చేశాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఆలోచనలో ఉందట. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటిదార్ బెంగళూరు జట్టుతోనే ఉంటారట. ఇక మూడో ప్లేయర్ గా ఇంగ్లాండ్ స్పిన్ ఆల్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ కు అవకాశం దక్కనుందని సమాచారం.

మొదటి రిటైన్ ప్లేయర్ గా కోహ్లీకి రూ. 18 కోట్లు కన్ఫర్మ్ కాగా.. రజత్ పటిదార్ రెండో రిటైన్ ప్లేయర్ గా తీసుకోనుందని సమాచారం. పటిదార్ మూడు సీజన్ లనుంచి ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. దీంతో అతడిని రూ.14 కోట్లు చెల్లించి బెంగళూరు జట్టు తీసుకోనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మూడో రిటైన్ ప్లేయర్ గా విల్ జాక్స్ కు మూడో రిటైన్ ప్లేయర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

జాక్స్ పవర్ హిట్టింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు. అతను ప్రస్తుతం అన్ని టీ20 ప్రపంచ లీగ్ ల్లో రాణిస్తున్నాడు. భవిష్యత్తు దృష్ట్యా ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ఆర్సీబీ జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ కు రూ. 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరితో పాటు  ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ ను నాలుగు కోట్లు పెట్టి అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో తీసుకోవచ్చు. యష్ 2024 ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించడంతో ఈ సారి అతన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.                   

సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ కెప్టెన్ డుప్లెసిస్ కు ఈ సారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించినా టైటిల్ గెలవడంతో విఫలమైంది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. తాజాగా మ్యాక్సీ ఆర్సీబీను అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ 2024 సీజన్ తర్వాత   ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసందే. స్టార్ బౌలర్ సిరాజ్ సైతం ఈ సారి మెగా ఆక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

2023 మినీ యాక్షన్ లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు. వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా.. అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 17 సీజన్ లు జరిగినా బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ నెగ్గలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.