అమెరికాలో హనుమకొండ వాసి మృతి.. డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యుల ఎదురు చూపులు

అమెరికాలో హనుమకొండ వాసి మృతి.. డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యుల ఎదురు చూపులు

హనుమకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. అమెరికాలో ఉంటున్న ఆత్మకూరు గ్రామానికి చెందిన రాజేష్..మూడు రోజుల క్రితం అమెరికాలో మృతి చెందాడు..దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన కుమారుడు మృతిచెందినట్లు సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.. కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. సాయంకోసం ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.  

ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్  ఉన్నత చదువులకోసం తొమ్మిదేళ్ల క్రిందట అమెరికాకు వెళ్లాడు. 9నెలల క్రితం తండ్రి మృతిచెందాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం  మృతి చెందినట్టు కుటుంభ సభ్యులకు అతని స్నేహితులు సమాచారం ఇచ్చారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ణప్తి చేశారు.