![జేఈఈ మెయిన్స్ లో రెజోనెన్స్ విజయ పరంపర](https://static.v6velugu.com/uploads/2025/02/resonance-warangal-achieves-outstanding-results-in-jee-main-2025_KnuFsBoYqt.jpg)
హనుమకొండసిటీ, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్–1 ఫలితాల్లో వరంగల్ రెజోనెన్స్ కు చెందిన 8 మంది విద్యార్థులు 99 పైగా పర్సంటెజ్ సాధించారు. 54 మంది 95 శాతం, 118 మంది 90 శాతం పర్సంటేజ్ సాధించి సత్తా చాటారని రెజోనెన్స్ వరంగల్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు.
ఎం.చరణ్తేజ 99.89 శాతం, వెంకట్ జశ్వంతో 99.66, సీహెచ్ సాయిదత్తు 99.59, కె.శిత్తీజ్ 99.56, వి.శశికౌశిక్ 99.48, ఎండీ ఉర్ రహమాన్ 99.27, వీవీ ఫణి హర్షిత్ 99.26, వి.రాజశేఖర్ 99.25 శాతం సాధించారు. విద్యార్థులను చైర్మన్తోపాటు అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవెందర్ రెడ్డి, లెక్కల రమ్యరెడ్డి, అకడమిక్ డీన్ బీఎస్ గోపాలరావు, కళాశాలప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.