![సమ్మె శిబిరంలోనే ఆర్టీసీ కార్మికుడి రిటైర్మెంట్](https://static.v6velugu.com/uploads/2019/11/retirement.jpg)
అచ్చంపేట, వెలుగు: 30 ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహించిన ఓ కార్మికుడు సమ్మె శిబిరంలో ఉద్యోగ విరమణ వీడ్కోలు పొందాడు. అచ్చంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్గా చేస్తున్న కేఎస్రావు రిటైర్మెంట్వేడుకను శనివారం తోటి కార్మికులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ కోసం మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కార్మికుడిని గౌరవంగా డిపో నుంచి పంపించాల్సి ఉండగా, ప్రభుత్వ మొండివైఖరితో సమ్మె శిబిరంలోనే వీడ్కోలు మీటింగ్ జరపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేఎస్రావును పలువురు కార్మికులు శాలువా, పూలమాలలతో సన్మానించారు.